AP Inter supplementary exams 2025:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు మే 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించారు. మూడు నుంచి నాలుగు లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇప్పుడు పరీక్షలు పూర్తయినందున సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు చేస్తున్నారు. అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు ప్రశ్నపత్రాల మూల్యాంకనం ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి వెంటనే ఫలితాలు విడుదల చేయాలని భావిస్తోంది. అయితే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాలు త్వరగా విడుదలయితే డిగ్రీలో ప్రవేశానికి వెళ్లవచ్చని భావిస్తున్నారు. ఫలితాలను ఆలస్యం చేయకుండా మీ చివరి నాటికి విడుదల చేయాలని బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 8 నుంచి 9 రోజులు పాటు రోజుకి రెండు షిఫ్టుల వారీగా ఇంటర్ మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం ఇంటర్ పరీక్షలు పూర్తి చేశారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు యొక్క పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ ఎప్పుడు?
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలను మే 31వ తేదీ నాటికి విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రారంభించిన ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు త్వరితగతిన ఫలితాలు విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే డిగ్రీ అడ్మిషన్స్ ప్రారంభమైనందున త్వరగా ఫలితాలు విడుదల చేస్తే పాసైన అయినటువంటి విద్యార్థులు డిగ్రీల చేరే అవకాశం ఉంటుందని బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఫలితాలు ఏ వెబ్సైట్లో చూసుకోవాలి?
- https://resultsbie.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- హోం పేజీలో ” AP Inter supplementary exams 2025 results ” ఆప్షన్స్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి
- సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి
- వెంటనే ప్రింట్ అవుట్ లేదా డౌన్లోడ్ చేసుకోండి.
FAQ’s:
1. ఏపీ ఇంటర్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షలు ఫలితాలు ఎప్పుడు?
ఫలితాలను మే 31వ తేదీ నాటికి విడుదల చేయనున్నారు
2. ఫలితాలు చూసుకునే అధికారిక వెబ్సైట్ ఏమిటి?
https://resultsbie.ap.gov.in వెబ్సైట్లో చెక్ చేసుకోండి