1st క్లాస్ నుండి ఇంటర్/ డిప్లొమా వరకు చదువుతున్న విద్యార్థులకు ₹18,000/- స్కాలర్షిప్స్ ఇస్తారు – ఇలా Apply చెయ్యండి.

By: Sivakrishna Bandela

On: November 8, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Parivartan ECSS Scholarships 2025-26:

బడికి వెళ్లే విద్యార్థులకు వారి యొక్క చదువు ఆగిపోకుండా HDFC బ్యాంకు ప్రతి సంవత్సరం Parivartan ECSS (Educational Crisis Scholarship Support) Programme అనే స్కాలర్షిప్ పథకాన్ని విడుదల చేస్తుంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ స్కాలర్షిప్ అమలు చేయడానికి ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ లేదా డిప్లమా లేదా ఐటిఐ చదువుతున్నటువంటి విద్యార్థుల వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ మరొకసారి ప్రకటన విడుదల చేశారు. భారతదేశంలో ప్రస్తుతం సంబంధించినటువంటి తరగతుల్లో చదువు కొనసాగిస్తున్నటువంటి విద్యార్థిని, విద్యార్థులు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారికి ₹15 వేల నుండి ₹18 వేల రూపాయల వరకు స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది.

ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుని కొనసాగించలేని విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి మీకు అర్హత ఉన్నట్లయితే గడువులోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఎవరికోసం?:

ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ప్రధానంగా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల కోసం రూపొందించబడినటువంటి ప్రోగ్రాం :

ఏపీ ఆడబిడ్డ నిధి పథకం తాజా సమాచారం: Full Details

తల్లికి వందనం పధకం డబ్బులు పడలేదా?: ఈరోజు లాస్ట్ డేట్ వెంటనే ఇలా చేయండి డబ్బులు వస్తాయి.
  • ఫస్ట్ క్లాస్ నుండి 12వ తరగతి లేదా డిప్లమా వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు అర్హులు.
  • ఇంటర్మీడియట్ లేదా డిప్లమా చదువుతున్న వారు అర్హులు.
  • ITI, పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా అర్హులే.

అర్హతలు ( eligibility criteria):

ఈ స్కాలర్షిప్ పొందడానికి విద్యార్థులకు ఈ క్రింది అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.

  1. విద్యార్థులు తప్పనిసరిగా వారి యొక్క చదువు ప్రస్తుతం కొనసాగిస్తూ ఉండాలి.
  2. ప్రస్తుత విద్యా సంవత్సరం 2025-26 కి సంబందించి ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ లేదా డిప్లమా వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు అర్హులు.
  3. గత తరగతి పరీక్షల్లో కనీసం 55 శాతం మార్కులు వచ్చినవారై ఉండాలి.
  4. కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షలు దాటకూడదు.
  5. కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

ఎంత స్కాలర్షిప్ వస్తుంది? ( Total scholarship amount):

విద్యార్థులు చదువుతున్న తరగతులను బట్టి స్కాలర్షిప్స్ ఈ విధంగా చెల్లిస్తారు.

సికింద్రాబాద్ రైల్వే నుండి స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు : 10th అర్హత

విద్యార్థుల తరగతి స్కాలర్షిప్ మొత్తం
క్లాస్ 1-6₹15,000/-
క్లాస్ 7-12₹18,000/-
ఇంటర్మీడియట్ ₹18,000/-
ITI /డిప్లొమా /పాలిటెక్నిక్ ₹18,000/-

పైన తెలిపిన మొత్తం స్కాలర్షిప్ డబ్బులను ఓకేసారీ విద్యార్థులు ఖాతాలో జమ చేస్తారు.

ఈ స్కాలర్షిప్ డబ్బులను ఏ ఖర్చులకు వాడుకోవచ్చు?:

ఏపీ, TS స్కూల్స్ విద్యార్థులకు ఈ నెలలో 6 రోజులు సెలవులు: Check Details

ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం తాజా సమాచారం – ప్రతి మహిళకు నెలకు ₹1,500/- : పూర్తి వివరాలు చూడండి.
  • స్కూల్ లేదా కాలేజీ ఫీజులకు
  • పుస్తకాలు మరియు స్టేషనరీ వస్తువులను కొనుక్కోవడానికి
  • ప్రయాణ ఖర్చులకు
  • పరీక్ష ఫీజులకు
  • ఇతర విద్యా అవసరాలకు వాడుకోవచ్చు.

దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్ వివరాలు?:

పరివర్తన స్కాలర్షిప్స్ ప్రోగ్రాంకి దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ తప్పనిసరిగా ఉండాలి.

  1. విద్యార్థుల యొక్క ఆధార్ కార్డు
  2. రేషన్ కార్డ్ లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం
  3. గత విద్యా సంవత్సరం యొక్క మార్క్స్ మెమో ( 55% కంటే ఎక్కువ ఉండాలి )
  4. చదువుతున్న స్కూల్ లేదా కాలేజీ యొక్క బోనఫైడ్ సర్టిఫికెట్
  5. స్కూల్ ట్యూషన్ ఫీజు యొక్క రసీదు.
  6. బ్యాంకు ఖాతా వివరాలు.
  7. కుటుంబ ఆర్థిక పరిస్థితుల యొక్క వివరాలు అవసరం అవుతాయి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?:

విద్యార్థులు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.

  • ముందుగా విద్యార్థులు Buddy4study వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • “HDFC Bank Parivartan ECSS Scholarship” లింక్ పై క్లిక్ చేయండి
  • “Apply Now” బటన్ పై క్లిక్ చేయండి
  • మీ మొబైల్ లేదా ఈమెయిల్ అడ్రస్ తో రిజిస్టర్ చేసుకోండి.
  • విద్యార్థుల యొక్క వివరాలన్నీ నమోదు చేసి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయండి.
  • తప్పులు లేకుండా ఫారం పూర్తి చేసి సబ్మిట్ చేయండి.

దరఖాస్తు చేసుకునే ఆఖరు తేదీ :

ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాం కి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ : డిసెంబర్ 25, 2025.

ఆఖరి తేదీ కంటే ముందే అప్లై చేస్తే ఎంపిక అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున విద్యార్థినీ విద్యార్థులు త్వరపడండి.

ఎంపిక చేసే విధానం:

  1. ఆన్లైన్ అప్లికేషన్స్ స్క్రీనింగ్ చేస్తారు.
  2. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
  3. అవసరమైతే విద్యార్థుల చేత టెలిఫోన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
  4. చివరగా అర్హులైనటువంటి విద్యార్థులకు, స్కాలర్షిప్ మొత్తాన్ని వారి యొక్క ఖాతాలో జమ చేస్తారు.

ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థినీ విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి అర్హులైనటువంటి అభ్యర్థులు డిసెంబర్ 31, 2025వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోగలరు.

AP Auto Drivers Sevalo Scheme 2025 Released – Check Eligible List Here

Note: స్కాలర్షిప్స్ కి సంబంధించినటువంటి వివరాల కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు విజిట్ చేయండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page