Summer Holidays:
ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులకు మరొక తీపి కబురు కేంద్ర విద్యా శాఖ అందించింది. ఈ వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున అది కూడా ఉత్తర భారత దేశంలో ఎండ తీవ్రత మరింత బాగా పెరిగినందున విద్యార్థులకు సంబంధించినటువంటి స్కూల్స్ హాలిడేస్ ని మరో 46 రోజులు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో మరొక 46 రోజులు పాటు సెలవులు పొడిగించారు. ఈ వేసవి ఎండ తీవ్రత వల్ల బయటికి రావడానికి ఎంతో ఇబ్బందిగా ఉన్నటువంటి ఈ సందర్భంలో కేంద్ర విద్యాశాఖ ఒక చల్లటి కబురు అందించింది. అందులో భాగంగానే కేంద్ర విద్యాశాఖ అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాలయాలకు జూన్ ఫస్ట్ నుండి జూలై 16వ తేదీ వరకు మొత్తం 46 రోజులు సెలవులు ప్రకటించింది.
మళ్లీ పాఠశాలలు జూలై 17వ తేదీ నుండి పునః ప్రారంభమవుతాయని కేంద్ర విద్యా శాఖ తెలిపింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఎండ తీవ్రత నుంచి రక్షించడానికి ఏ నిర్ణయం తీసుకోవడం జరిగిందని కేంద్ర విద్యా శాఖ తెలిపింది. ఈ నిర్ణయంతో వారందరికీ ఒక మంచి ఉపశమనం కల్పించింది కేంద్ర విద్యా శాఖ.
సెలవులు మంజూరు చేసిన రాష్ట్రాల వివరాలు:
కేంద్ర విద్యా శాఖ ప్రకటించిన 46 రోజుల సెలవులు పొడిగింపు కొన్ని రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయి. అవసరాన్ని బట్టి తేదీల్లో మార్పులు చేసే అవకాశం అయితే ఉంది. సెలవులు పొడిగించిన రాష్ట్రాల్లో జూన్ 1 నుండి జూలై 16వ తేదీ వరకు సెలవులు మంజూరు చేశారు. ఆ రాష్ట్రాల వివరాలు ఇలా ఉన్నాయి
- ఉత్తరప్రదేశ్ రాష్ట్రం : ఈ రాష్ట్రంలో మొత్తం 46 రోజులు అనగా జూన్ ఒకటవ తేదీ నుండి జూలై 16వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు సెలవులు పొడిగించారు.
- మహారాష్ట్ర రాష్ట్రం: ఈ రాష్ట్రంలో మే 30వ తేదీ నుండి జూన్ 14వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు సెలవులు పొడిగించారు.
- తమిళనాడు రాష్ట్రం: 2025 జూన్ 1వ తేదీ నుండి జూలై 16వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు ఈ రాష్ట్రంలో సెలవులు పొడిగించారు.
- న్యూఢిల్లీ NCR: ఈ రాష్ట్రంలో కూడా జూన్ ఒకటవ తేదీ నుండి జూలై 16వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు
- రాజస్థాన్ రాష్ట్రం: 2025 మే 31వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు సెలవులు పొడిగించారు.
- పశ్చిమ బెంగాల్ రాష్ట్రం : 2025 జూన్ రెండవ తేదీ నుంచి జూలై 17వ తేదీ వరకు మొత్తం 45 రోజుల సెలవులు పొడిగించారు.
- కర్ణాటక రాష్ట్రం: 2025 మే 30వ తేదీ నుండి జూలై 14వ తేదీ వరకు మొత్తం 46 రోజుల సెలవులు పొడిగించారు.
- బీహార్ రాష్ట్రం: జూన్ 1వ తేదీ నుండి జూలై 16వ తేదీ వరకు ఈ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాలయాల్లో సెలవులు పొడిగించారు.
ఈసారి వేసవి సెలవులు గత సంవత్సరం కంటే ఎక్కువనే చెప్పుకోవచ్చు. గత సంవత్సరం 36 రోజులు వేసవి సెలవులు పొడిగించగా, ఈసారి ఏకంగా 46 రోజుల వరకు ఎండ తీవ్రత వల్ల పైన తెలిపిన రాష్ట్రాల్లో సెలవులు పొడిగించడం జరిగింది.
ఈ సెలవులు ఉన్న సమయంలో విద్యార్థులు ఏదైనా స్కిల్స్ ని నేర్చుకునే అంశాలపైన ఫోకస్ చూసినట్లయితే వారి యొక్క భవిష్యత్తు బాగుంటుందని విద్యావేత్తలు తెలుపుతున్నారు.