AP 10th Exams 2026 – Important Instructions:
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి 2026 పరీక్షలు ఈరోజు నుండి అనగా మార్చి 16వ తేదీ నుండి ప్రారంభంకానున్నాయి. అయితే పరీక్షకు హాజరు అయ్యే విద్యార్థులు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. పరీక్ష జరిగే రోజు విద్యార్థులకు 9:30AM నుండి 12:45PM వరకు పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు పరీక్ష జరగడానికి ముందే పరీక్ష కేంద్రానికి హాజరు కావాలి. ఐదు నిమిషాలు ఆలస్యమైనా వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుంది. అయితే పరీక్ష రాసే విద్యార్థులకు విద్యాశాఖ కొన్ని నిబంధనలను విధించింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పరీక్షకు హాజరయ్య విద్యార్థులు తీసుకువెళ్లాల్సిన వస్తువులు:
- పదో తరగతి హాల్ టికెట్
- పరీక్ష రాయడానికి బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్
- ఎరేజర్
- పెన్సిల్
- స్కేల్
- షార్ప్నర్
- ఇతర ముఖ్యమైన వస్తువులు.
పరీక్షకు తీసుకువెళ్లకూడని వస్తువులు:
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ క్రింది వస్తువులను తీసుకొని వెళ్ళకూడదు. ఒకవేళ తీసుకువెళ్లినట్లయితే వారిని పరీక్ష రాయండి ఎవరు, అలాగే డిబర్ చేసే అవకాశం కూడా ఉంటుంది.
- మొబైల్ ఫోన్
- స్మార్ట్ వాచెస్
- మైక్రోఫోన్స్
- డిజిటల్ పెన్స్
- టాబ్లెట్
- చేతి మీద రాతలు ఉండకూడదు
- స్లిప్పులు ఉండకూడదు
- ఎటువంటి పుస్తకాలు పరీక్ష హాల్లోకి తీసుకొని వెళ్ళకూడదు
విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు:
ఏపీ పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు ఈ క్రింది సూచనలను తప్పనిసరిగా పాటించాలి
- పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలి.
- ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రం లోనికి అనుమతించబడరు.
- పరీక్ష కేంద్రానికి వచ్చేటప్పుడే కావాల్సిన వస్తువులు హాల్టికెట్స్ అన్ని తీసుకొని రావాలి
- పరీక్ష రాసేటప్పుడు మధ్యలో బయటికి అనుమతించరు.
- పరీక్ష హాల్లో విద్యార్థులు వేరొకరి పేపర్ చూసి కాపీ కొట్టకూడదు
- అలా చేసిన విద్యార్థులను, పరీక్షలు రాయకుండా డిబార్ చేసే అవకాశం ఉంటుంది
- పరీక్ష హాల్లోని ఇన్విజిలేటర్ కి సహకరించాలి
- ఇన్విజిలేటర్ చెప్పిన సూచనలను ప్రతి విద్యార్థి పాటించాలి.
కావున ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు పైన తెలిపిన సూచనలను పాటిస్తూ, దిగ్విజయంగా పదో తరగతి పరీక్షలను పూర్తిచేసుకుని మీ భవిష్యత్తుకు బాటలు వేసుకోండి.