AP తల్లికి వందనం పధకం 2025 స్టేటస్ చెక్: డబ్బులు వచ్చాయా లేదా?.స్టేటస్ ఎలా చెక్ చేయాలి?-పూర్తి గైడ్

By: Sivakrishna Bandela

On: June 30, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Thalliki Vandanam Scheme 2025:

ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకాన్ని (Thalliki Vandanam Scheme 2025) జూన్ 12వ తేదీన అట్టహాసంగా ప్రారంభించారు. సూపర్ సెక్స్ పథకాల్లో ముఖ్యమైనటువంటి పథకం తల్లికి వందనం పథకం. ఈ పథకం ద్వారా స్కూలుకి వెళ్లే పిల్లల తల్లులకు సంవత్సరానికి ₹15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి, పిల్లల చదువులకు సహాయ పడడం కోసం ఈ పథకాన్ని మొదటిసారిగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ₹15,000/- నేరుగా తల్లి యొక్క బ్యాంకు ఖాతాలోకి జమ చేయడం జరిగింది. అయితే ఆ పథకం డబ్బులు తల్లుల ఖాతాలో డిపాజిట్ అయ్యాయా లేదా అనే దానికి సంబంధించిన స్టేటస్ ని ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా ఇప్పుడు చూద్దాం. డబ్బులు రాని వారు ఏ విధంగా కొత్తగా అప్లై చేయాలో కూడా తెలుసుకుందాం.

ఈ ఆర్టికల్ ద్వారా మీరు తెలుసుకునే అంశాలు:

Join What’s App Group

  1. తల్లికి వందనం పధకం (Thalliki Vandanam Scheme 2025) డబ్బులు అకౌంట్ లోకి డిపాజిట్ అయ్యాయా లేదా అని స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి.
  2. డబ్బులు రాకపోవడానికి కారణాలు ఏమిటి?
  3. కొత్తగా ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
  4. పథకానికి కావాల్సిన అర్హతలు మరియు సర్టిఫికెట్ల వివరాలు.

డబ్బులు వచ్చాయా లేదా స్టేటస్ ఎలా చెక్ చేయాలి?:

తల్లికి వందనం పథకం లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక beneficiary status check portal ను అందించనుంది. (Example: https://gsws-nbm.ap.gov.in ). ఇక్కడ మీరు ఈ క్రింది విధంగా చెక్ చేయవచ్చు.

తల్లికి వందనం పధకం డబ్బులు పడలేదా?: ఈరోజు లాస్ట్ డేట్ వెంటనే ఇలా చేయండి డబ్బులు వస్తాయి.
  • స్టెప్ 1: ముందుగా అధికారిక వెబ్సైట్ https://gsws-nbm.ap.gov.in లోకి వెళ్ళండి.
  • స్టెప్ 2: know your payment status లేదా Scheme payments ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 3: మీ యొక్క ఆధార్ నంబర్ లేదా రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి
  • స్టెప్ 4: Submit పై క్లిక్ చేసిన వెంటనే, మీ అకౌంట్ లోకి పథకం డబ్బులు జమయ్యాయా లేదా అన్నది తెలుస్తుంది.
  • Bank Account లేదా Aadhar Linked మొబైల్ నెంబర్ కు ఎస్ఎంఎస్ కూడా వస్తుంది.

డబ్బులు రాలేదు అంటే?:

ఏపీ తల్లికి వందనం పథకానికి కొత్తవారు ఇలా అప్లై చేయండి

మీకు ఈ తల్లికి వందనం పథకం డబ్బులు రాలేదు అంటే ఈ క్రింది కారణాలు అయి ఉండవచ్చు.

  • రేషన్ కార్డులో మీ పేరు లేకపోవడం వల్ల
  • భారత సర్టిఫికెట్ లేదా ఇమ్యునైజేషన్ రికార్డ్ అప్లోడ్ చేయకపోవడం.
  • బ్యాంక్ ఎకౌంటు ఆధార్ కి లింక్ చేయకపోవడం.
  • మీ గ్రామ సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా నిర్ధారణ కాకపోవడం.

ఈ సమస్యల్ని పరిష్కరించాలి అంటే మీ గ్రామ,వార్డు సచివాలయ అధికారిని సంప్రదించగలరు.

1st క్లాస్ నుండి ఇంటర్/ డిప్లొమా వరకు చదువుతున్న విద్యార్థులకు ₹18,000/- స్కాలర్షిప్స్ ఇస్తారు – ఇలా Apply చెయ్యండి.

కొత్తగా ఎలా అప్లై చేయాలి?:

2025 నుండి నూతన దరఖాస్తుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం NBM పోర్టల్ ద్వారా అప్లికేషన్స్ తీసుకుంటుంది.

  • ముందుగా https://gsws-nbm.ap.gov.in ఓపెన్ చేయండి
  • Apply For Thalliki Vandanam scheme 2025” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  • లబ్ధిదారుని యొక్క ఆధార్, పిల్లల వివరాలు, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలను నింపండి
  • అన్ని సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి
  • స్టేటస్ ని మీ యొక్క మొబైల్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు

అర్హతలు మరియు అవసరమైన డాక్యుమెంట్స్ :

తల్లికి వందనం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి క్రింది అర్హతలు మరియు సర్టిఫికెట్స్ కావాలి.

తల్లికి వందనం పధకం డబ్బులు డిపాజిట్ అయ్యాయి ఇలా చెక్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం తాజా సమాచారం – ప్రతి మహిళకు నెలకు ₹1,500/- : పూర్తి వివరాలు చూడండి.
  1. పథకం యొక్క లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ నివాసి అయ్యి ఉండాలి
  2. పిల్లలు స్కూల్ కి వెళ్తున్న పిల్లలు అయి ఉండాలి
  3. తల్లి మరియు పిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డు ఉండాలి
  4. బ్యాంకు ఖాతా ఉండాలి. ఆ ఖాతాకు కచ్చితంగా ఆధార్ లింక్ అయి ఉండాలి.
  5. ఇమ్యునైజేషన్ రికార్డు కలిగి ఉండాలి
  6. పిల్లల బర్త్ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
  7. రేషన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
  8. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తల్లి పేరిట ఉండాలి

ముఖ్యమైన సూచనలు :

  • పథకం వర్తింపు తేదీ : జూన్ 12, 2025
  • పొందే సహాయం : ప్రతి బిడ్డకు 15 వేల రూపాయలు సంవత్సరానికి.
  • ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో మరి కళాశాలలో చదువుతున్న ఫస్ట్ క్లాస్ నుండి 12వ తరగతి వరకు విద్యార్థులు అర్హులు.

https://gsws-nbm.ap.gov.in

పైన తెలిపిన విధంగా మీ స్టేటస్ చెక్ చేసుకుని, కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు వెంటనే అప్లై చేయండి

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page