AP 10th/ SSC 2026 Results Date:
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి 2026 పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ నాటికీ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రారంభించినటువంటి ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు, మూల్యాంకన ప్రక్రియ త్వరగా పూర్తిచేసి ఏప్రిల్ చివరి వారం నాటికి ఫలితాలను విడుదల చేసేందుకు అన్ని విధాలుగా సన్నాహాలు చేస్తున్నారు. పరీక్ష పత్రాల మూల్యాంకనంలో ఎటువంటి తప్పులు దొర్లకుండా టీచర్లకు ట్యాబ్ లను ప్రభుత్వం అందించింది. విద్యార్థులకు సబ్జెక్టులలో వచ్చినటువంటి మార్కులను ఎటువంటి తప్పులు లేకుండా ఆన్లైన్లో నమోదు చేసి, తర్వాత ఫలితాలను విడుదల చేయనున్నారు. ఏపీ పదవ తరగతి ఫలితాలకు సంబంధించిన సమాచారం ఇప్పుడు చూద్దాం.
ఏపీ పదవ తరగతి 2026 ఫలితాలు విడుదల తేదీ:
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి 2026 పరీక్షల యొక్క ఫలితాలను ఏప్రిల్ చివరి వారం నాటికి (ఏప్రిల్ 30వ తేదీ నాటికీ) ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు తెలియజేస్తున్నారు. మూల్యాంకన ప్రక్రియ త్వరగా పూర్తిచేసి ఏపీ పదవ తరగతి బోర్డు వెబ్సైట్ ద్వారా మరియు వాట్సాప్ ద్వారా అలాగే ఎస్ఎంఎస్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకునే విధంగా అధికారులు విద్యార్థులకు ఏర్పాట్లు చేయనున్నారు.
సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు ఉంటాయి?:
ఏపీ పదవ తరగతి రెగ్యులర్ పరీక్షల యొక్క ఫలితాలు విడుదలైన తర్వాత సబ్జెక్టులలో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు మే చివరివారం నాటికి సప్లమెంటరీ రాత పరీక్షలు నిర్వహించి, జూన్ మొదటి వారంలో ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు ప్రారంభించారు అధికారులు.
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాల?:
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షల యొక్క ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకోండి.
- ముందుగా ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి.
- వెబ్సైట్ హోమ్ పేజీలో “AP 10th Results 2026” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేటాఫ్ బర్త్ ఎంటర్ చేయండి
- సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి
- సబ్జెక్టులో వారిగా మీకు వచ్చిన మార్పులను చెక్ చేసుకొని
- మెమోని డౌన్లోడ్ చేసుకోండి ప్రింట్ అవుట్ తీసుకోండి.
AP 10th/SSC 2026 Results Website
FAQ’S:
1. ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల యొక్క ఫలితాలు ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది?
ఏప్రిల్ చివరి నాటికి ఫలితాలను విడుదల చేయమన్నారు
2. మొత్తం ఎన్ని లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు?
6,50,000 మందికి పైగా విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షలు రాశారు
3. పదో తరగతి పరీక్షల ఫలితాలను చూసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ఏమిటి?
https://www.bse.ap.gov.in/ వెబ్సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.