ఏపీ తల్లికి వందనం పథకం వెరిఫికేషన్ పూర్తి 2వ విడత జాబితా విడుదల చేశారు: జాబితాలో మీ పేరు ఉందేమో ఇలా చూసుకోండి

By: Sivakrishna Bandela

On: July 2, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Thalliki Vandanam Scheme 2025:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12వ తేదీన అట్టహాసంగా ప్రారంభించిన టువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి, జూన్ 20వ తేదీ వరకు అభ్యంతరాలు పెట్టుకున్న లబ్ధిదారుల యొక్క వెరిఫికేషన్ జూన్ 28వ తేదీ వరకు చేశారు. ఇప్పుడు వెరిఫికేషన్ పూర్తయినందున 2వ విడత జాబితాని జూన్ 30వ తేదీన విడుదల చేయనున్నారు. రెండవ విడత జాబితాలో పేరు ఉన్న లబ్ధిదారులకు జూలై 5వ తేదీన ప్రతి విద్యార్థికి ₹13,000/- రూపాయల చొప్పున తల్లి అకౌంట్ లో డిపాజిట్ చేస్తారు. రెండో విడత జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం.

తల్లికి వందనం పథకం అంటే ఏమిటి?:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఫస్ట్ క్లాస్ నుండి 12వ తరగతి వరకు విద్యార్థులను స్కూల్ కి పంపించేటువంటి తల్లులకు ఆర్థిక సహాయం అందించి, ఆర్థిక తోడ్పాటు కల్పించే విధంగా తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క తల్లి అకౌంట్లో ₹13,000/- ఆ తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డిపాజిట్ చేసే విధంగా ఈ పథకాన్ని జూన్ 12, 2025న అధికారికంగా ప్రారంభించారు.

Join Whats App Group

తల్లికి వందనం పధకం డబ్బులు పడలేదా?: ఈరోజు లాస్ట్ డేట్ వెంటనే ఇలా చేయండి డబ్బులు వస్తాయి.

ముఖ్యమైన తేదీలు:

మీ ఇంటి వద్దనే ఉన్న పోస్టల్ ఆఫీస్ ద్వారా నెలకు ₹40,000 సంపాదించే అవకాశం: అప్లై చేయండి

  • అభ్యంతరాలు పరిశీలన ముగింపు తేదీ : జూన్ 28, 2025
  • రెండవ విడత లబ్ధిదారుల జాబితా విడుదల తేదీ : జూన్ 30, 2025
  • రెండవ విడత జాబితాలో పేర్లు ఉన్న వారికి డబ్బులు డిపాజిట్ అయ్యే తేదీ : జూలై 5, 2025

లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి?:

రెండవ విడత లబ్ధిదారుల జాబితాలో తల్లికి వందనం పథకానికి సంబంధించి మీ పేరు ఉందో లేదో అనేది మీరు రెండు విధాలుగా తెలుసుకోవచ్చు.

  1. మొదటి విధానం: మొదటగా మీ మొబైల్ లోనే ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి: Website Link
  2. తల్లికి వందనం పథకాన్ని ఎంపిక చేసుకొని, విద్యార్థి తల్లి యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీరు ఈ పథకానికి అర్హులా కాదా అనేది తెలుపుతుంది.
  3. 2వ విధానం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ నెంబర్ +9195523 00009 ద్వారా
  4. తల్లికి వందనం పథకం రెండవ విడత జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.

AP పాఠశాల విద్యార్థులకు సంవత్సరానికి ₹6000 డిపాజిట్ ఇలా అప్లై చేయాలి

1st క్లాస్ నుండి ఇంటర్/ డిప్లొమా వరకు చదువుతున్న విద్యార్థులకు ₹18,000/- స్కాలర్షిప్స్ ఇస్తారు – ఇలా Apply చెయ్యండి.

మీరు ఇప్పుడు చేయవలసిన పని?:

  • జూన్ 20వ తేదీ వరకు అభ్యంతరాలు సబ్మిట్ చేసిన లబ్ధిదారులు
  • జూన్ 30వ తేదీన మీ దగ్గరలోనే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి
  • రెండవ విడత లబ్ధిదారుల లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేయించుకోండి.
  • మీ పేరు ఉన్నట్లయితే ఖచ్చితంగా జూలై ఐదో తేదీన 13వేల రూపాయలు డిపాజిట్ అవుతాయి.
  • సచివాలయానికి వెళ్ళలేని వారు మీ మొబైల్ ద్వారా పైన తెలిపిన వాట్సాప్ నంబర్ లేదా అధికారిక వెబ్సైట్ నుండి రెండవ విడత లబ్ధిదారుల జాబితాలో పేరుని చెక్ చేసుకోండి.

అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితా ఇలా చూసుకోండి

రెండో విడత జాబితాలో కూడా మీ పేరు లేనట్లయితే, ఎప్పటికి మీరు అభ్యంతరాలు సబ్మిట్ చేసిన మీ పేరు కనిపించకపోతే మళ్లీ మీరు అభ్యంతరాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశం మళ్ళీ ఎప్పుడు కల్పిస్తారో సచివాలయంలో అడిగి తెలుసుకోండి.

ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం తాజా సమాచారం – ప్రతి మహిళకు నెలకు ₹1,500/- : పూర్తి వివరాలు చూడండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page