TS 10th supplementary exams schedule 2025:
ఎట్టకేలకు తెలంగాణ పదవ తరగతి ఫలితాలను విడుదల చేశారు.ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయడం జరిగింది. పదో తరగతి ఫలితాల్లో 92.78% ఉత్తీర్ణత రావడం జరిగిందని అధికారులు తెలిపారు. ఇందులో బాలురు 91.32% ఉండగా, బాలికలు 94.26% ఉన్నారు. బాలురు కంటే బాలికలే 2.94% అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే పదవ తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థుల కోసం జూన్ మూడవ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు సప్లిమెంటరీ రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు.
సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే :
తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థుల కోసం సప్లమెంటు రాత పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది.
- సప్లిమెంటరీ పరీక్షల తేదీ: జూన్ 3 నుండి జూన్ 13 వరకు
- పరీక్ష ఫీజు చెల్లింపు ఆఖరి తేదీ: 16th మే, 2025
- ఒక్కో సబ్జెక్టుకు రీకౌంటింగ్ ఫీజు : ₹500/-
- రీ వెరిఫికేషన్ కొరకు ఫీజు : ₹1000/-
- రీకౌంటింగ్ , రీ వెరిఫికేషన్ ఫలితాల కోసం ఎదురు చూడకుండా సప్లిమెంటరీ పరీక్షలు రాయాలని బోర్డు సూచించింది.
పైన తెలిపినటువంటి షెడ్యూల్ ప్రకారం విద్యార్థుల వారి యొక్క పరీక్ష ఫీజును చెల్లించి సప్లిమెంటరీ రాత పరీక్షలకు ప్రిపేర్ అయ్యి పరీక్షలకు అటెండ్ అవ్వాలి.
టెన్త్ ఫలితాల్లో టాపర్స్ వీరే :
తెలంగాణ పదవ తరగతి పరీక్ష ఫలితాలు చూసిన తర్వాత టెన్త్ ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. బాలుర అభ్యర్థుల కంటే బాలిక అభ్యర్థులే 2.78% అత్యధికంగా ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఇందులో బాలురు 91.32% ఉండగా, బాలికలు 94.26% ఉన్నారు.
పదో తరగతి ఫలితాల్లో మహబూబాబాద్ టాప్ ప్లేస్ లో నిలిచింది. ఆ జిల్లాలో 99.29% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇక వికారాబాద్ జిల్లా 73.97%తో ఆఖరి స్థానంలో నిలిచింది.
- తెలంగాణ పదవ తరగతి ఫలితాలు చూసుకోవడానికి అధికారిక వెబ్సైట్ : www.bse.telangana.gov.in
FAQ’s:
1. తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు?:
జూన్ 3 నుండి జూన్ 13వ తేదీ వరకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
2. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు ఆఖరి తేదీ?
మే 16వ తేదీ లోపు పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు అందరూ వారి యొక్క స్కూల్లో ఫీజు చెల్లించాలి.