DSSSB Notification 2025:
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి పదో తరగతి అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకునే విధంగా 855 పోస్టులతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు, ఏపీ మరియు తెలంగాణకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష మరియు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి అన్ని అర్హతలు కలిగిన వారు గడువు లాగా దరఖాస్తులు చేసుకోండి.
ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు?:
DSSSB డిపార్ట్మెంట్ నుండి విడుదలైన 855 పోస్టులకి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఈ క్రింది పట్టిక ద్వారా చూసి తెలుసుకోండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు |
| పోస్ట్ పేరు | మల్టీ టాస్కింగ్ స్టాఫ్ |
| మొత్తం పోస్టులు | 855 |
| అర్హతలు | 10th pass |
| ఆఖరి తేదీ | 15th జనవరి, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి విడుదలైన 85 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు పదో తరగతి పాస్ అయిన అర్హత తప్పనిసరిగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర అన్ని రాష్ట్రాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 27 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి. రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయో పరిమితులో సడలింపు కల్పిస్తారు.
సెలక్షన్ ప్రాసెస్?:
DSSSB బోర్డు నుండి విడుదలైన ఉద్యోగాలకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
- ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి.
- దరఖాస్తులు చేసుకునే వారికి కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహిస్తారు.
- రాత పరీక్షలు ఉత్తీనులైన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
- మెడికల్ టెస్ట్లు నిర్వహించి అన్ని అర్హతలు ఉన్నవారికి ఉద్యోగాలు ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు ఎంత?:
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹100/- ఆన్లైన్ ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ & వికలాంగులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. వారు ఆన్లైన్లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు?:
DSSSB డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు ఈ క్రింది తేదీలలో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
- అప్లికేషన్ ప్రారంభ తేదీ: 17th డిసెంబర్, 2025
- అప్లికేషన్ ఆఖరి తేదీ: 15th జనవరి, 2026
ఎంత శాలరీ ఉంటుంది?:
DSSSB డిపార్ట్మెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 35 వేల రూపాయల వరకు శాలరీ చెల్లిస్తారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున శాలరీ తో పాటు ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి.
ఎలా అప్లై చేయాలి?:
నోటిఫికేషన్లోని పూర్తి వివరాలు చూసిన తర్వాత అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లికేషన్ లింకు ద్వారా వెంటనే దరఖాస్తులు చేసుకోండి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం కోసం మా వెబ్సైటు www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.