BEL Notification 2025:
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి 14 ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ పోస్టులను పర్మినెంట్ విధానంలో భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి ఐటిఐ మరియు డిప్లమాలో అర్హత కలిగి, 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత తర్వాత పరీక్షలు నిర్వహిస్తారు. జనవరి 2026 లేదా ఫిబ్రవరి 2026 లో రాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క అర్హతలు, వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ వంటి పూర్తిగా వివరాలు చూసి తెలుసుకుందాం.
ఉద్యోగాల వివరాలు?:
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి విడుదలయిన ఉద్యోగాల వివరాలు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోండి.
| అంశము | వివరాలు |
| విడుదల చేసిన సంస్థ | భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ |
| ఉద్యోగాల పేర్లు | టెక్నీషియన్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైని |
| అర్హతలు | 10th, ITI, డిప్లొమా |
| వయస్సు | 18 నుండి 28 సంవత్సరాలు |
| ఆఖరి తేదీ | 23rd డిసెంబర్, 2025 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
పోస్టుల అర్హతలు:
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పదవ తరగతి, iti మరియు డిప్లమా అర్హత కలిగి ఉండాలి.
ఎంత వయసు ఉండాలి?:
18 నుండి 28 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన వారు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు కల్పిస్తారు.
దరఖాస్తు ఫీజు వివరాలు?:
BEL విద్యుత్ శాఖ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కేటగిరీల వారీగా ఈ క్రింది దరఖాస్తు రుసుము చెల్లించాలి.
- జనరల్ , ఓబీసీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు : ₹590/-
- మిగిలిన అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు
సెలక్షన్ ప్రాసెస్:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- ముందుగా ఆన్లైన్లో అప్లికేషన్స్ షార్ట్ లిఫ్ట్ చేస్తారు.
- జనవరి లేదా ఫిబ్రవరి నెలలో కంప్యూటర్ ఆదారిత రాత పరీక్ష నిర్వహిస్తారు.
- టెక్నికల్ మరియు జనరల్ టాపిక్స్ నుంచి 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది.
- రాతపరీక్షలో 35% మార్కులు వచ్చినవారు అర్హత పొందిన వారవుతారు.
శాలరీ వివరాలు:
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ముందుగా ఆరు నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో నెలకు 24 వేల రూపాయలు స్టైపెండ్ చెల్లిస్తారు. ట్రైనింగ్ తర్వాత నెలకు 80,000 వరకు జీతాలు ఉంటాయి. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున ఇతర అన్ని రకాల అలవెన్స్ కూడా ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకునే అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తులు సబ్మిట్ చేయాలి.
- అప్లికేషన్ ప్రారంభ తేదీ: 2nd డిసెంబర్, 2025
- అప్లికేషన్ ఆఖరి తేదీ: 23rd డిసెంబర్, 2025
- రాత పరీక్షలు నిర్వహించే తేదీలు : జనవరి లేదా ఫిబ్రవరి 2026
ముఖ్యమైన లింక్స్:
ఆన్లైన్లో భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని వెంటనే అప్లై చేయండి.
కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ని సందర్శించండి.